నారద వర్తమాన సమాచారం
ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బందిని సన్మానించి, అత్మీయ వీడ్కోలు పలికిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్
ఉద్యోగ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించిన ఎస్పీ
పోలీసు శాఖలో చేరి విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన
- V. వెంకయ్య(SI కమ్యూనికేషన్)
- G. కోటిరెడ్డి (ASI, అయినవోలు పోలీస్ స్టేషన్)
- K.వెంకటేశ్వర్లు (ASI చిలకలూరిపేట రూరల్)
- .R.మధుసూదన రావు(ASI,DTC పల్నాడు)
- M. నాగేశ్వరరావు (AR హెడ్ కానిస్టేబుల్)
శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండి వారి సాధకబాధకాల్లో మమేకమై సేవలందించే అవకాశం పోలీసుశాఖ లోనే అవకాశం ఉంటుందన్నారు.
పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఇన్ని సంవత్సరాలపాటు పోలీసుశాఖ లో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు.
ఉద్యోగంలో ఉన్నపుడు చేసిన సేవలే ఉద్యోగం అనంతరం కూడా వ్యక్తి గుర్తుండేలా మంచి పేరు, ప్రఖ్యాతలు తెస్తాయన్నారు.
ఉద్యోగ నిర్వహణలో ఎంతో నిబద్దత, అంకితభావంతో పోలీస్ శాఖకు అందించిన సేవలను పోలీసు శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఇకపై కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు.
భవిష్యత్తులో వారికి ఏ సహాయం కావాలన్నా పోలీస్ శాఖ ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అడ్మిన్ ఎస్పి జె వి సంతోష్ , ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ వి. సత్తి రాజు డి సి ఆర్ బి సీఐ ఎమ్.శ్రీనివాస రావు ,హోం గార్డ్ ఆర్ ఐ ఎస్.కృష్ణ , వెల్ఫేర్ ఆర్.ఐ ఎల్. గోపీనాథ్ , ఏ వో టీ. దుర్గా ప్రసాద్ , పల్నాడు జిల్లా పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ టీ. మాణిక్యాల రావు మరియు సిబ్బంది,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.