నారద వర్తమాన సమాచారం
అద్దెకు పెళ్లి కుమార్తె మధ్యవర్తుల భారీ మోసం
విజయవాడ: వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న యువతిని మధ్యవర్తులు పెళ్లికాని అమ్మాయిగా నమ్మించి. రూ.4లక్షలు కట్నం తీసుకొని పెళ్లి చేసి మోసం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం నలుగురు దళారీల ద్వారా విజయవాడలో ఒక సంబంధం ఉందని తెలుసుకొని కర్ణాటకకు చెందిన యువకుడి కుటుంబ సభ్యులు. స్థానిక పెద్దలతో కలిసి పల్లవి అనే యువతిని చూడటానికి వచ్చాడు.
యువతి నచ్చి వివాహం చేసుకునేందుకు అంగీకరించారు. యువతి తల్లిదండ్రుల వైద్యం నిమిత్తం రూ.2 లక్షలు, బ్రోకర్లకు రెండు లక్షలు ఇచ్చారు. కర్ణాటకలో వివాహం చేసుకుంటామంటే మధ్యవర్తులు కాదు కూడదంటూ విజయవాడలోనే చేయాలని దుర్గ గుడిలో వివాహం చేయించారు. అనంతరం కర్ణాటకకు వెళ్లిపోయారు. వెళ్లిన దగ్గర నుంచి పెళ్లికూతురు పల్లవి భర్తను దూరం పెడుతోంది. అనుమానం రావడంతో నిలదీయగా తనకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారని, తనను ఐదు రోజులు కాంట్రాక్టుకు మాట్లాడుకున్నారని రూ.50 వేలు ఇస్తామని, 35 వేలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన డబ్బులు బ్రోకర్లు తీసుకున్నారని చెప్పింది. దీంతో మోసపోయినట్లు గ్రహించి బాధితుడు విజయవాడ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.