నారద వర్తమాన సమాచారం
నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు…ఎప్పుడైనా గేట్లు ఎత్తే అవకాశం
ఏపీ:
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఇన్ ఫ్లో 1,00,085, అవుట్ ఫ్లో 30,726 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 874.30 అడుగులకు చేరింది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఏ క్షణమైనా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.