నారద వర్తమాన సమాచారం
కడప జిల్లా లో జైలు సిబ్బంది సస్పెండ్?
కడప జిల్లా కేంద్ర కర్మాగారంలో ఐదుగురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది, జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరిండెంట్ కమలాకర్ తో పాటు, మరో ముగ్గురు జైలు వార్డర్లును ఉన్నంత అధికారులు సస్పెండ్ చేశారు ఈ మేరకు జైలు శాఖ డీజీ, సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
జైలులో ఖైదీలకు సెల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లకు మొబైల్ ఫోన్లు అందిస్తున్నా రన్న అభియోగాలపై గత నాలుగు రోజులుగా జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ విచారణ జరిపారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.