నారద వర్తమాన సమాచారం
ప్రకాశం..నెల్లూరు జిల్లా
నడికుడి నుంచి కనిగిరి ప్రాంతం వరకు రైలు ఇంజిన్ ట్రయల్ రన్
నెరవేరబోతున్న మెట్ట ప్రాంతవాసుల దశాబ్దాల నాటి కల..ఎట్టకేలకు వినబడ్డ రైలుకూత
ప్రకాశం జిల్లాలోని నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. దశాబ్దాలుగా నత్తనడకన సాగిన రైల్వే లైన్ పనులు ఎట్టకేలకు ఊపందుకున్నాయి,కొంత మేర రైల్వే లైన్ పూర్తయింది… ప్రధానంగా భూసేకరణకు ఉన్న అడ్డంకులన్నింటినీ పరిష్కరించడంతో పనుల పూర్తికి మార్గం సుగమమైంది. కనిగిరి, పామూరు మండలాల మధ్య 50 కిలోమీటర్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేశారు.తాజాగా రైల్వే అధికారులు నడికుడి నుంచి కనిగిరి ప్రాంతం వరకు రైలు ఇంజిన్ ట్రయల్ రన్ నిర్వహించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.