నారద వర్తమాన సమాచారం
మనమిత్ర-వాట్సప్ గవర్నెన్స్ పై అవగాహన కల్పించండి
పీజీఆర్ఎస్ ప్రజాఫిర్యాదుల వేదికలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
జిల్లాలో వాట్సప్ గవర్నెన్స్ కార్యక్రమం ‘మనమిత్ర’ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు.
ఎరువుల దుకాణాలపై జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ఆర్టీజీఎస్ వెబ్ సైట్ లో దస్త్రాలను అప్ లోడ్ చేయాలన్నారు.
దేశభక్తి ఉట్టి పడేలా విద్యాలయాలు, పర్యాటక ప్రాంతాల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆగస్టు 8 వరకూ విద్యాలయాల్లో రంగవల్లుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యాటక ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను ఎప్పటికపుడు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.