నారద వర్తమాన సమాచారం
సరూర్ నగర్ భర్త హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
డంబెల్స్తో కొట్టి భర్తను చంపిన భార్య చిట్టి
కొద్దికాలం క్రితమే భార్య చిట్టికి పరిచయమైన ప్రియుడు హరీష్
ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీయడంతో, భార్య చిట్టిని మందలించిన భర్త శేఖర్
దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని పడుకున్నాక ప్రియుడు హరీష్ను ఇంటికి పిలిపించిన చిట్టి
పడుకున్న శేఖర్ గొంతు నులిమిన హరీష్.. భర్త ప్రతిఘటించడంతో డంబెల్స్తో తలపై కొట్టి చంపిన చిట్టి
ఉదయం అవ్వగానే పోలీసులకు ఫోన్ చేసి, తన భర్త రాత్రి ఎవరితోనో గొడవపడి వచ్చి పడుకున్నాడు.. ఉదయం చనిపోయాడు అని చెప్పిన భార్య
ఆమె తీరుతో అనుమానం వచ్చి విచారించగా, ఇద్దరం కలిసి చంపినట్లు ఒప్పుకున్న చిట్టి
నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన శేఖర్తో చిట్టికి 2009లో వివాహం
వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు.. కూతురు హాస్టల్లో ఉంటూ చదువుకుంటుండగా, హత్య జరిగిన రోజు కుమారుడిని వినాయకుడి దగ్గర పడుకోమని పంపించిన చిట్టి
Discover more from
Subscribe to get the latest posts sent to your email.