నారద వర్తమాన సమాచారం
నేటి మహిళల సాధికారతకు ఉపయోగపడే పీహెచ్ డీ పట్టా
పీహెచ్ డీ పొందిన అశోక్ కు సన్మానించి, అభినందనలు తెలిపిన గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి
ఉద్యోగ బాధ్యతలతోపాటు విద్యా రంగానికి ఎంతోకొంత తన వంతు సాయ పడాలనే మంచి ఉద్దేశ్యంతో నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ పట్టా పొందిన తలకాయల అశోక్ కుమార్ ఎంతో మంది ఉద్యోగులకు ఆదర్శనీయమని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పీహెచ్ డీ పట్టా పొందిన తలకాయల అశోక్ కుమార్ ఉద్యోగ బాధ్యతలతోపాటు విద్యా పరంగా అత్యున్నత స్థానాన్ని అధిరోహించటానికి డాక్టరేట్ చేయడం అభినందనీయమన్నారు. అంతేకాకుండా ఆయన ఎన్నుకున్న పీహెచ్ డీ అంశం మహిళలకు ఉపయోగపడే విధంగా ఉండటం మంచి పరిణామమన్నారు. నేటి తరం మహిళలు తమ కాళ్లపై నిలబడే విధంగా ఆంధ్రప్రదేశ్ జీవనోపాదులు, ఆర్ధిక స్వావలంబన (Sustainable Livelihood through Entrepreneurship in Andhra Pradesh) అనే అంశం తీసుకుని పీహెచ్ డీ పొందినట్లు తలకాయల అశోక్ కుమార్ కు అభినంధనలు తెలిపారు. అశోక్ పరిశోధనకు ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలోని వాణిజ్యం & మేనేజ్మెంట్ విభాగం లోని ప్రొ. కె. శారదాదేవి పర్యవేక్షణలో చేయడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.