నారద వర్తమాన సమాచారం
యూరియా అక్రమ తరలింపు కేసులో ఇద్దరికి రిమాండ్: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
యూరియా అక్రమాలపై జిల్లా అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. పొందుగల చెక్ పోస్టు వద్ద నిబంధనలకు విరుద్ధంగా యూరియాను తెలంగాణకు తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా.. గౌరవ కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించిందని తెలిపారు.
సెప్టెంబరు 02న పొందుగల చెక్ పోస్టు వద్ద మండల స్థాయి బృందం ఆకస్మిక తనిఖీలో 630 కేజీల యూరియాను తెలంగాణకు అక్రమంగా తరలిస్తూ నల్గొండ జిల్లా వాసులు పులి పిచ్చయ్య, బూక్య రవి అనే ఇద్దరు వ్యక్తులను పట్టుబడ్డారన్నారు. ఇద్దరికీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించందన్నారు. ఎరువుల రవాణాకు వినియోగించిన వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు.
ఎరువులకు సంబంధించిన అంశంలో అక్రమాలకు పాల్పడితే ఎకా చట్టం (నిత్యావసరాల చట్టం), ఇతర రాష్ట్రాలకు ఎరువుల తరలింపు నియంత్రణ ఆదేశం,1973 మరియు ఎరువుల నియంత్రణ ఆదేశం, 1985 ల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
తమ వ్యక్తిగత వాహనాలను ఇతరులు ఎరువుల రవాణాకు వినియోగించకుండా జాగ్రత్త పడాలని పౌరులకు సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.