నారద వర్తమాన సమాచారం
పోలీసు అమరవీరుడా నీకు వందనం…. నీ అనిర్వచనీయ త్యాగాన్ని మేము మరువం… పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల
పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అక్టోబర్ 21 వ తేదీ పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమమును నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు.
ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఐఏఎస్
మరియు
నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు
నర్సరావుపేట లింగంగుంట్ల లోని పోలీసు పెరేడ్ గ్రౌండ్ నందు పల్నాడు జిల్లా ఏ ఆర్ డి.ఎస్.పి జి.మహాత్మగాంధీ పర్యవేక్షణలో అడ్మిన్ ఆర్.ఐ యం.రాజా పరేడ్ కమాండర్ ఈ పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమం సందర్భంగా స్మృతి పరేడ్ నిర్వహించి విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ పోలీస్ అమర వీరుల స్థూపానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్ల మాట్లాడుతూ….
సమాజానికి పోలీసు వారు చేసే సేవలు అనిర్వచనం. పోలీస్ వ్యవస్థ లేని సమాజాన్ని మనం ఊహించలేం.
పోలీసు వ్యవస్థ లేకపోతే సమాజంలో సంఘవిద్రోహ శక్తుల ఆగడాలకు అడ్డువుండదు. దేశ సరిహద్దుల్లో సైనికులు, దేశంలో పోలీసులు నిత్యం పహారాకాస్తు ప్రజల ధన మాన ప్రాణాలను రక్షిస్తున్నారు.
ఈ క్రమంలో ఎంతోమంది పోలీస్ వారు సంఘవిద్రోహ శక్తులను అణచివేసే క్రమంలో తమ ప్రాణాలను అర్పించి అసువులు బాసినారు. వారి ప్రాణత్యాగం వెలకట్టలేనిది.
ఈ సందర్భంగా సమాజ హితం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆ మహావీరుల త్యాగాన్ని స్మరించుకోవడం మనకు ఎంతో గర్వకారణం వారి యొక్క స్ఫూర్తిని ముందుకు కొనసాగిస్తూ పోలీస్ శాఖ ప్రజలకు సమాజానికి మరిన్ని సేవలను అందిస్తుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా పలనాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ మాట్లాడుతూ…
21 అక్టోబర్ 1959 న భారత సైన్యం లఢక్ లోని హాట్ స్ప్రింగ్ అనే ప్రాంతంలో చైనా దురాక్రమణ ను కరమ్ సింగ్, D.S.P. గారి నాయకత్వంలో సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టిన రోజు ఇది. ఈ సమరంలో కరమ్ సింగ్ తో పాటు 10 మంది భారత సైనికులు అమరులయ్యారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ యోధుల త్యాగాలను స్మరించుకుంటూ, అక్టోబర్ 21 తేదిన అమర వీరుల సంస్మరణ దినంగా ఈ రోజుని జరుపుకుంటున్నాం.
ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఎంతో మంది సైనికులు మరియు పోలీసులు సంఘవిద్రోహ శక్తులను ఎదుర్కొనే క్రమంలో ప్రాణ త్యాగం చేస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 26 (వీరిలో 9 మంది పల్నాడు జిల్లా వారు) మంది పోలీసు వారు వీరమరణం పొందడం జరిగినది. వీరందరికీ మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
వీరమరణం పొందిన పోలీసు వారి యొక్క కుటుంబ సభ్యులను ప్రతి సంవత్సరం పిలిచి వారిని సన్మానించుకుని, వారికి ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని తీర్చడానికి కృషి చేస్తున్నాము.
పోలీస్ అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ స్మరించుకుంటూ వారి యొక్క స్ఫూర్తిని పునికి పుచ్చుకొని భవిష్యత్తులో సమాజానికి ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి కృషి చేస్తామని పల్నాడు జిల్లా పోలీసు తరఫున తెలుపుకుంటున్నానని అన్నారు..
ఈ సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ…
సరిహద్దుల్లో సైనికులు మరియు దేశంలోనీ పోలీసు వారు నిరంతర కృషి వలననే ప్రజలు నిరంతరం ప్రశాంతంగా ఉంటున్నారు.
ఆ విధంగా పోలీసు వారు ప్రజలకు అండగా ఉంటూ కొన్ని దురదృష్టకర సంఘటనలలో సంఘవిద్రోహ శక్తులను అణచే క్రమంలో అసువులు బాసి వీరమరణం పొందారు అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను.
వారి ప్రాణత్యాగం వెలకట్టలేనిది. వారి త్యాగస్ఫూర్తి భావితరాలకు ఆదర్శం అని కొనియాడారు.
ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా వీర మరణం పొందిన ఒక ఎస్ఐ మరియు 8 మంది పోలీస్ సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించి, వారికి పల్నాడు జిల్లా పోలీస్ శాఖ తరపున ఎస్పీ మరియు కలెక్టర్ జ్ఞాపికలు అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఎస్పీ కలెక్టర్ తో పాటు అదనపు ఎస్పీ జె.వి.సంతోష్ (పరిపాలన విభాగం) అదనపు ఎస్పీ క్రైమ్ Ch. లక్ష్మీపతి ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ వి.సత్తి రాజు ,సత్తెనపల్లి డీ.ఎస్పీ యం.హనుమంత రావు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి M. వెంకట రమణ , AR DSP మహాత్మా గాంధీ సిఐలు,ఆర్ఐలు,ఎస్సైలు, పోలీస్ అసోసియేషన్ పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ T. మాణిక్యాల రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







