నారద వర్తమాన సమాచారం
ప్రతిభ అవార్డు అందుకున్న స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరావు
గురజాల శ్రీ వికాస్ హై స్కూల్ డైరెక్టర్ అడపా శ్రీనివాసరావు అంకితభావంతో విద్యారంగంలో చేసిన సేవలకు దక్షిణ ప్రైవేట్ లెక్చరర్స్, టీచర్స్ ఆర్గనైజేషన్ గుర్తించింది. ఇంటర్నేషనల్ టీచర్స్ దినోత్సవం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ ప్రతిభ అవార్డు -2025 శ్రీనివాసరావు అందుకున్నట్లు ఆర్గనైజేషన్ ఫౌండర్, జాతీయ ప్రెసిడెంట్ డాక్టర్ పి.నాగయ్య తెలిపారు. ఈ స్కూలు ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దగా నాడు నిరుద్యోగ యువతకు గుర్తింపునిచ్చింది.అవార్డు గ్రహీత కు స్కూల్ టీచర్స్ షేక్ జాన్, అడపా కృష్ణవేణి, బండి శంకర్, శ్రీనివాస రావులు కంగ్రాట్స్ తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.

 
                                    





