నారద వర్తమాన సమాచారం
శబరిమలకి భారీగా పెరుగుతున్న యాత్రీకుల రద్దీ దృష్ట్యా… శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులకు కీలక ఆదేశాలు జారీచేసిన కేరళ ప్రభుత్వం.
కేరళ హైకోర్టు ఆదేశాలతో కీలక నిర్ణయం అమలు చేస్తున్నట్లు ప్రకటన…
24 నవంబర్ 2025 వరకు – వర్చువల్ క్యూ ద్వారా 70,000 మంది, స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మందికి మాత్రమే అనుమతి
దర్శనానికి చెల్లుబాటు అయ్యే వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి
పాస్ లేకుండా నీలక్కల్ నుంచి శబరిమలకి ప్రవేశం లేదు
స్పాట్ బుకింగ్ కోటా రోజుకు 5,000 – కోటా పూర్తయితే బుకింగ్ లేదు
స్పాట్ బుకింగ్ కేంద్రాలు: నీలక్కల్, వండిపెరియార్–సత్రం, ఎరుమెలి, చెంగన్నూర్
నీలక్కల్లో కోటా ముందే ముగిసే అవకాశం – యాత్రికులు ఇతర కేంద్రాల్లోనే పాస్ పొందాలని సూచన….
శబరిమలకు బయలుదేరే ముందు పాస్ తమ వద్ద ఉందని యాత్రికులు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి…
నీలక్కల్, పంపా, సన్నిధానం వద్ద భద్రతా ఏర్పాట్లకు సహకరించాలని విజ్ఞప్తి….
శబరిమల హెల్ప్లైన్: 14432
ఇతర రాష్ట్రాల నుంచి శబరిమల వచ్చే భక్తులకు హెల్ప్ లైన్ నంబర్ 04735-14432
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







