తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం!
నారద వర్తమాన సమాచారం
తెలంగాణ నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కూడా ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు.
తెలుగులో ప్రమాణం చేయడం ఆసక్తిగా మారింది. లోక్భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్, మండలి ఛైర్మన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు హాజరయ్యారు. ముందుగా పూర్తి వందేమాతరం గేయంతో కార్యక్రమం ప్రారంభమైంది.
ఇక శివ్ ప్రతాప్ శుక్లా విషయానికి వస్తే.. ఆయన 73 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన నేత. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆయన, ఏబీవీపీ, ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు సైతం వెళ్లారు.
యూపీలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, కేబినెట్ మంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2023-2026 మధ్య హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా తెలంగాణకు విచ్చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









