వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరికలు.
టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నాయకులు.
సాదరంగా ఆహ్వానించిన మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్.
నారద వర్తమాన సమాచారం జి కొండూరు ప్రతినిధి.
కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సమక్షంలో వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఐతవరంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
కొండపల్లి మున్సిపాలిటీ 3వ డివిజన్ కు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకర సత్యనారాయణ , చల్లా కోటేశ్వరరావు , సుంకర శ్రీహరి గారు, దాసరి శ్రీనివాసరావు , దాసరి తిరుమలరావు , దాసరి హరి కొండలరావు , రంగా శ్రీనివాసరావు , కాదం బాబురావు , డాకారపు వీరబాబు , దామెర్ల వెంకట్రావు తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
కొండపల్లి మున్సిపాలిటీ 27వ డివిజన్ కు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ బాజీ . ఆరంపుల రామారావు , బుద్ధా కనకమ్మ , కంచర్ల చుక్కమ్మ , ప్రత్తిపాటి అర్జునరావు , దూడల అప్పయ్య . తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షులు చుట్టుకుదురు శ్రీనివాసరావు , 27 డివిజన్ టీడీపీ అధ్యక్షులు బసవ ఉమామహేశ్వరరావు. పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.