నారద వర్తమాన సమాచారం
తిరుమల
టీటీడీ ఈవోగా జే. శ్యామలరావు బాధ్యతల స్వీకరణ
టీటీడీ కార్యనిర్వహణాధికారిగా జే. శ్యామలరావు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో(ఎఫ్ఏసి) ఏవి ధర్మారెడ్డి నుండి బాధ్యతలు స్వీకరించారు. నూతన ఈవో తన సతీమణితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత జేఈఓ శ్రీ వీరబ్రహ్మం ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. కాగా, తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహ స్వామివారిని ఈవో దర్శించుకున్నారు. ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.