Monday, July 14, 2025

పల్నాడు జిల్లాలో పలు సమస్యాత్మకగ్రామాలను విజిట్ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్

పల్నాడు జిల్లా పోలీస్…….

పల్నాడు జిల్లాలోని రాజుపాలెం,బెల్లంకొండ, సత్తెనపల్లి టౌన్,అచ్చంపేట, క్రోసూరు పోలీస్ స్టేషన్లను మరియు రాజుపాలెం, బెల్లంకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలోనీ సమస్యాత్మక గ్రామాలైన,పెదనేమలిపురి,నాగిరెడ్డి పాలెం గ్రామాలను, అచ్చంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మాదిపాడు ఔట్ పోస్ట్ ను విజిట్ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్

పోలీసు స్టేషన్ల తనిఖీల్లో భాగంగా స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం పోలీసు స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళా ఫిర్యాది దారులకు వెయిటింగ్ రూమ్ వుండాలని, పెండింగ్ లో ఉన్న వాహనాలను త్వరగా డిస్పోస్ చెయ్యాలనీ సూచించారు.
సత్తెనపల్లి పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలనీ,డ్రంకన్ డ్రైవ్ లు నిర్వహించాలని మరియు రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలనీ సూచించారు.
హత్యలు, హత్యాయత్నాలు, క్రైమ్ ఎగైనెస్ట్ ఉమన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సి ఆర్, పి .సి ,తదితర కేసుల రికార్డ్స్ ను పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు వాటి పురోగతిపై కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులు అరెస్ట్ కాని కేసులలో నిందితులను త్వరగా టీమ్స్ ఫామ్ చేసి అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్షన్ సమయంలో నమోదైన కేసులను సమీక్షించి వాటిలో అరెస్టులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
అదే విధంగా పోలీసు స్టేషన్ పరిధిలో గల స్కూల్స్ వద్ద,హాస్టల్స్ లాంటి ప్రదేశాలలో నిఘా ఏర్పాటు చేయాలని, ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలో గంజాయి నిర్మూలనకై కృషి చేయాలని దానికి గాను ప్రత్యేక టీమ్స్ పెట్టి గంజాయి అమ్ముతున్న తాగుతున్న వారిపై నిఘా పెట్టీ అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదే విధంగా రాత్రి మరియు పగలు బీట్ల పని తీరును నిరంతర మానిటరింగ్ చేయాలని, అప్పుడు నేరాలు తగ్గుతాయని తెలిపారు.
అదే విధంగా రౌడీ షీటర్ల కదలికలు మరియు కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నేరాల అడ్డుకట్టకు నైట్ బీట్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
సమస్యాత్మక గ్రామాల్లో పర్యటిస్తూ ఎస్పీ..

రాజుపాలెం , బెల్లంకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పెదనేమలిపురి ,నాగిరెడ్డిపాలెం గ్రమాలలో ఎస్పీ ప్రజలతో మాట్లాడుతూ ప్రజలు చట్టాలను, గౌరవించాలని శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని, ఎవరైనా రెచ్చగొట్టే మాటలు చెప్తే అవి విని ఆలోచించకుండా ఆవేశపడి గొడవలు తల దూర్చరాదని కేసులతో మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు.
గ్రామాల్లో ఎటువంటి సమస్య ఉన్న పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేయాలని లేదంటే నా దృష్టి కైన తీసుకురావాలని అంతేగానీ ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని ప్రజలకు సూచించారు.
అదేవిధంగా ఎవరైనా గ్రామాల్లో అల్లర్లు సృష్టించి,గ్రూపు తగాదాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే అటువంటి వారిపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని, ఇంకా గాని ఎక్కువ చేస్తే జిల్లా బహిష్కరణకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా

ఎస్పీ తెలియచేశారు..


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version