నారద వర్తమాన సమాచారం
ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలి
భూదాన్ పోచంపల్లి లో గ్రంథాలయాన్ని పరిశీలిస్తున్న కృష్ణవేణి
భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలని జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల జిల్లా సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి అన్నారు. మండల పరిధిలోని జలాల్పురం గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను బుధవారం ఆమె సందర్శించి పరిశీలించారు. భేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పౌష్టికాహారం తీసుకొని రక్తహీనతను తగ్గించాలని ప్రణాళికాబద్ధంగా చదువుకొని లక్ష్యం చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం మిషన్ కోఆర్డినేటర్ హర్ష, భార్గవి, నికిత, మనీషా, ప్రత్యేకాధికారిని ఇందిరా పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.