నారద వర్తమాన సమాచారం
తిరుపతి జిల్లా మూడు రోజుల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
తిరుపతి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయితీ రాజ్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం నేటి మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వీరికి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తదితర అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి అలిపిరి శ్రీవారి పాదాల మెట్ల మార్గం చేరుకున్నారు. వీరికి తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తదితర అధికారులు ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు.
కాలి నడకన ఉప ముఖ్యమంత్రి రాత్రి 8 గంటలకు తిరుమల చేరుకుని రాత్రికి బస చేస్తారు. అక్టోబర్ 2 న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం 11.05 గంటలకు మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. బుధవారం రాత్రి తిరుమలలో బస చేస్తారు. అక్టోబర్ 3 న సా.4.30 గంటలకు తిరుమల నుండి బయలుదేరి తిరుపతిలో జరగనున్న వారాహి సభ కార్యక్రమం పాల్గొంటారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.