నారద వర్తమాన సమాచారం
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు
అమరావతి:
విజయవాడ దుర్గమ్మ ఆలయానికి తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సిపీ రాజశేఖర్ బాబు, ముందస్తుగా అవసరమైన భద్రత ఏర్పాటు చేశారు.
కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు, దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించనున్నారు. చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి, బుధవారం మూడు గంటలకు ఇంద్రకీలాద్రి కి చేరుకొనున్నారు.
ఇవాళ మూల నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీ మాతగా దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో దుర్గమ్మను వీక్షించేందుకు ఇంద్రకీలాద్రికి 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. క్యూలైన్లలో నీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తామని మంత్రి ఆనం నారాయణ రెడ్డి తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.