Wednesday, February 5, 2025

రోడ్డు భద్రతా – 2024 సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన,తీసుకొనవలసిన జాగ్రత్తల గురించి తెలిపిన ఎస్పీ

నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా పోలీస్…*

రోడ్డు భద్రతా నియమాలు పాటించండి – ప్రమాదాలు నివారించండి — పల్నాడు జిల్లా ఎస్పీ  కంచి శ్రీనివాస రావు ఐపీఎస్

రోడ్డు భద్రతా – 2024 సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన,తీసుకొనవలసిన జాగ్రత్తల గురించి తెలిపిన ఎస్పీ

కంచి శ్రీనివాసరావు  జిల్లాలోని మండలాల వారిగా యాక్సిడెంట్ల నివారణకు చేపట్ట వలసిన పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

గంజాయి నివారణకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డీ- అడిక్షన్ సెంటర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ…

రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడం.

నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం, విశ్రాంతి లేకుండా ఎక్కువ దూరం వాహనం నడపడం, వ్యతిరేక దిశలో ప్రయాణించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించక పోవడం, అతివేగం, U- టర్న్ తీసుకునేటప్పుడు చుట్టూ వున్న వాహనాలను గమనించక పోవడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు.

విద్యార్ధి దశ నుండే రోడ్డు భద్రతా నియమాలపై తప్పక అవగాహన కలిగి ఉండాలి. అంతేకాకుండా వాటిపై వారి కుటుంబ సభ్యులకు మరియు చుట్టుప్రక్కల వారికి కూడా కల్పించాలి.

కుటుంబంలో ఏ వ్యక్తి అయినా ప్రమాదానికి గురైనా లేదా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతాయి. కావున వాహనాలను నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలను పాటించాలి.

రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద బాధితులకు తగిన దైర్యం చెప్పి, క్షతగాత్రులకు త్వరితగతిన వైద్యసహాయం అందే విధంగా తగిన పోలీసు వారు చర్యలు తీసుకోవాలి.

వాహనదారులు సీటు బెల్టు ధరించక పోవటం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఆటో సైడ్ సిట్టింగ్, డెఫెక్టీవ్ నంబర్ ప్లేట్స్, అనధికార పార్కింగ్ మొదలైన చట్టపరమైన ఉల్లంఘనలకు ఎవరూ పాల్పడకూడదని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు దిగువ పేర్కొన్న సూత్రాలు తప్పకుండా పాటించాలని తెలిపారు.

1) మద్యం సేవించి వాహనాలు నడుపరాదు.
2) వాహనాలు నడుపునప్పుడు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ మరియు ఇతర వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలి.
3) cell phone మాట్లడుతూ వాహనాలు నడుపరాదు.
4) అతివేగంతో వాహనాలు నడుపరాదు.
5)తప్పనిసరిగా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి.
6) జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా Line discipline పాటించాలి.
7)శ్రద్ధతో వాహనాలు నడపాలి.
8) వాహనాలు ఓవర్ టేక్(Over Take) చేసే సమయంలో తప్పనిసరిగా అద్దాలు(Mirrors) గమనించాలి.
9)రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సహాయం అందేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలి. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మరియు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జె.వి సంతోష్ పల్నాడు జిల్లాఇన్చార్జి డిటిఓ ఎన్ శివ నాగేశ్వరరావు  అసిస్టెంట్ ఎం.టి.ఓ శ్రావ్య  రెవిన్యూ అధికారి వినాయక  ఆర్డీవోలు రమణ కాంత్ రెడ్డి, మురళీకృష్ణ, మధులత వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version