నారద వర్తమాన సమాచారం
ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలి
- జిల్లా కలెక్టర్
పల్నాడు జిల్లా…గురజాల
ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. అరుణ్ బాబు సంబంధిత మండల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం గురజాల రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ సమావేశం మందిరంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారానికి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ని నిర్వహించాలని సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారికి సూచించారు. భూ సంబంధిత విషయాలలో అవకతవకులు పాల్పడవద్దని, రికార్డులు తారుమారు చేయడం వంటివి చేయవద్దని తెలియక తప్పు చేసినట్లయితే దానిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అర్జీదారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు. రెవిన్యూ సంబంధిత విషయాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పౌర సరఫరాల శాఖ ద్వారా అందిస్తున్న బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణాన్ని నిరోధించేలా చర్యలు చేపట్టాలన్నారు. పొర సరఫరాల శాఖ ద్వారా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకే చెందే విధంగా చూడాలన్నారు. గురజాల డివిజన్ పరిధిలో ప్రభుత్వ భూములు ఉన్నాయని పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా ఉంటుందని అన్నారు.ఎ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. డివిజన్ పరిధిలో పర్యాటక అభివృద్ధికి అవకాశం కలదని గుత్తికొండ బిలం, ధైదా వంటి క్షేత్రాలను పర్యాటక అభివృద్ధి దిశగా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. నాగార్జునసాగర్ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. రెవెన్యూ వ్యవస్థపై ప్రజలలో నమ్మకం ఉన్నదని ఆ నమ్మకాన్ని మరింత మెరుగుపరిచేలా పనులు చేయాలన్నారు. అనంతరం భారత రాజ్యాంగ డ్రాఫ్ట్ను ఆమోదించిన రోజు అయిన ప్రతి సంవత్సరం నిర్వహించే భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిఙ్ఞ చేయించారు . ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, గురజాల రెవెన్యూ డివిజనల్ అధికారి మురళీకృష్ణ మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.