నారద వర్తమాన సమాచారం
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులు ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ కుమార్ ఐఏఎస్
ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి అర్జీను తక్షణమే సరైన పరిష్కరణ ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కార్యక్రమంలో వచ్చే అర్జీలను బియాండ్ ఎస్ఎల్ఏ పోకుండా చూడాలన్నారు. అంతేకాకుండా ఐ గాట్ కర్మయోగి యాప్ను జిల్లాలో ఉన్న అన్ని కార్యాలయాల్లో సిబ్బంది పూర్తి చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వామ్యలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రానున్న బక్రీదు పండుగ దృష్టిలో ఉంచుకొని గోవద జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఈద్గాల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టి పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నాగార్జునసాగర్ నుండి త్రాగు నీటిని విడుదల చేసిన సందర్భంగా సంబంధిత పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపే విధంగా చూడాలన్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులు దృష్ట్యా జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్య మరియు నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.