నారద వర్తమాన సమాచారం
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సింగారెడ్డి రామచంద్రారెడ్డి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ నూతన అధ్యక్షుడు ఖరారయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ నూతన అధ్యక్షుడు ఖరారయ్యారు. బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న కొత్త వ్యూహంలో తాజా నిర్ణయం తీసుకుంది. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలకు రాష్ట్ర పార్టీ నాయకత్వం అప్పగించాలని నిర్ణయించింది. కడప జిల్లాకు చెందిన సింగారెడ్డి రామచంద్రరెడ్డి ని పార్టీ అధ్యక్షుడిగా ప్రధాని మోదీ టీం ఖరారు చేసినట్లు సమాచారం. అధ్యక్ష పదవి కోసం పార్టీలో పలువురు నేతలు పోటీ పడ్డారు. అయితే తొలి నుంచి పార్టీ కోసం పని చేస్తూ సాధారణ కార్యకర్త నుంచి ఎదిగిన వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. తొలి నుంచి ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్న సింగారెడ్డి రామచంద్రారెడ్డి కడప వాసి. పులివెందుల సమీపంలోని వేంపల్లె స్వస్థలం. 1978 నుంచి ఆర్ఎస్ఎస్లో పని చేస్తున్నారు. కాలేజీ అధ్యక్షుగానూ పని చేశారు. 2017లో ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.