Thursday, February 6, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ జె .వి సంతోష్..


నారద వర్తమానం సమాచారం

నరసరావుపేట.

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ జె .వి సంతోష్

ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 43 ఫిర్యాదులు అందాయి.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదుల కు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ  సూచించారు.

బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామానికి చెందిన సోము.వెంకటేశ్వర్లు 27.07.2024 వ తేదీన ఎటిఎం కి వెళ్లి డబ్బులు తీయటం తెలియక ఒక వ్యక్తిని అడుగగా 10,000/- తీసి ఇచ్చినట్లు ఏటీఎం కార్డు తనకు ఇవ్వకుండా సదరు వ్యక్తి తన దగ్గరే ఉంచుకొని తనకు తెలియకుండా 57,000/- డ్రా చేసినట్లు అంతట ఫిర్యాదు సదరు వ్యక్తిని గుర్తించి డబ్బులు అడగగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నందుకు గాను చట్టపరంగా చర్యలు తీసుకోవలసిందిగా అడిషనల్ ఎస్పీని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.

ముప్పాళ్ళ మండలం చాగంటి వారిపాలెం గ్రామానికి చెందిన రుద్రపాటి వెంకట కోటమ్మ నాలుగవ కుమార్తె అయిన విజయలక్ష్మి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు, ఫిర్యాది కుమార్తెకు అల్లుడికి మనస్పర్ధలు ఉన్నట్లు, అయితే ఫిర్యాది మరియు ఫిర్యాది తరపు వారిని అసభ్యకరంగా తిడుతూ వాట్సాప్ లలో మెసేజ్ లు పెడుతూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నందుకు గాను ఫిర్యాదు తనకు తగిన న్యాయం కొరకు  అడిషనల్ ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది.

దొడ్లేరు గ్రామానికి చెందిన దాసరి జ్యోతి భర్త చనిపోయిన వెంటనే ఫిర్యాది బావగారు అయిన జయన్న దాసరి జ్యోతి కి రావాల్సిన ఇంటిని, పొలమును ఆక్రమించుకొనగా ఫిర్యాదు భర్త
స్వగ్రామం అయిన బెల్లంకొండ మండలం నందీశ్వరపాడు నకు వెళ్లి అడగగా దాసరి జ్యోతిని ఆమె బావ అయిన జయన్న కొట్టి, తిట్టి అస్తి విషయానికి వస్తే చంపుతానని బెదిరించినట్లు అంతట జయన్న పై చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించవలసిందిగా ఫిర్యాది  అడిషనల్ ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.

చిలకలూరిపేట పట్టణానికి చెందిన చుండూరు కృష్ణమూర్తి అను అతను నరసరావుపేటకు చెందిన కనమర్లపూడి కృష్ణ అనే వ్యక్తికి అవసరాల నిమిత్తం 30,000/- రూపాయలు ఇచ్చినట్లు, సదరు డబ్బుల విషయమై ఫిర్యాదు అయిన చుండూరు కృష్ణమూర్తి కనమర్లపూడి కృష్ణ ఇంటికి వెళ్లి అడుగగా కొట్టి చంపుతానని బెదిరించినట్లు కావున సదరు కనమర్లపూడి కృష్ణ వలన ఫిర్యాదు అయిన చుండూరు కృష్ణమూర్తికి ప్రాణహాని ఉందని పై విషయమై చట్టపరమైన చర్యలు
తీసుకొనవలసిందిగా ఫిర్యాది శ్రీ అడిషనల్ ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.

అమరావతి మండలం అత్తలూరు గ్రామానికి చెందిన మేకల ఈశ్వరమ్మ రెండవ కుమార్తె అయిన చైతన్య కులాంతర వివాహం చేసుకున్నట్లు అయితే మేకల ఈశ్వరమ్మ రెండవ కుమార్తె అయిన చైతన్య మరియు ఆమె భర్త అశోక్, అశోక్ తరఫున బంధువులు ఆస్తి పంచివ్వమని ఫిర్యాదు ఇంటిపై దాడి చేసి ఇంట్లో సామాన్లు పగల గొట్టినట్లు అంతట ఫిర్యాది
తగిన న్యాయం చేయవలసిందిగా అడిషనల్ ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడమైనది.

నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామానికి చెందిన మెట్టు కోటిరెడ్డి గతంలో వణుకూరి వెంకటేశ్వర్ రెడ్డి వద్ద 2,00,000/- లు అప్పు తీసుకొని తిరిగి ఇచ్చినట్లు,సమయం అయిన ప్రామిసరీ నోటు పెట్టుకొని ఫిర్యాదు డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నట్లు కావున తనకు న్యాయం చేయవలసిందిగా అడిషనల్ ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేసి, వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version