నారద వర్తమాన సమాచారం
రాత్రి సమయంలో గేదలును అపహరించే వ్యక్తి అరెస్ట్
పిడుగురాళ్ల
పట్టణంలోని లెనిన్ నగర్ కు చెందిన కుంచపు దుర్గారావు అను యువకుడు పిల్లుట్ల రోడ్డులోని జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా సంచ రిస్తూ ఉండడంతో గమనించిన పోలీసులు అదుపులోకి తీసు కొని తనదైన శైలిలో ప్రశ్నించా రు.పట్టణంలోని ఇంటి బయట,దొడ్లలో కట్టేసి ఉన్న గేదలను అర్ధరాత్రి పూట దొంగిలించి,వాటిని దాచిపెట్టి, సంతలలో అమ్ముతున్నట్లు తెలిపారు.ఇటీవల కళ్ళెం టౌన్షిప్ వద్ద తిరుమల అపార్ట్మెంటు పరిధిలో కట్టేసి ఉన్న మూడు గేదేలను దొంగిలించినట్టు తెలిపారు. అందిన సమాచారం మేరకు దొంగిలింప బడిన గేదెలను స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ మూడు లక్షల రూపా యలు ఉంటుందని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచిన ట్లు పోలీసులు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.