నారద వర్తమాన సమాచారం
హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించిన పిడుగురాళ్ల పట్టణ సిఐ వెంకట్రావు
పిడుగురాళ్ల
పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పిడుగురాళ్ల పట్టణంలో సీఐ వెంకట్రావు ఆధ్వర్యంలో ఖలీల్ రెస్టారెంట్ నుండి స్థానిక పోలీ స్ స్టేషన్ మీదగాఎర్రవాగు బ్రిడ్జి దాకా హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సంద ర్భంగా సిఐ వెంకట్రావు మాట్లాడుతూ పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మోటార్ సైకిల్ వాహనదారు లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. పట్టణంలోని ప్రధాన వీధులలో బైకులపై యువకులు హెల్మెట్లు ధరించి భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించి ప్రజలకు అవగాహ న కల్పించారు.సిఐ వెంకట్రావు, ఎస్ ఐ శివ నాగరాజు,పోలీస్ లు స్వయంగా హెల్మెట్లు ధరించి బైకులను నడుపుతూ ప్రజలను చైతన్య పరిచారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శివ నాగరాజు,పోలీస్ లు పట్టణ ద్విచక్ర వాహనదారులు,తది తరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.