నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం
పిడుగురాళ్ల,
ఈ రోజు పిడుగురాళ్ల మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఖాళీ అయిన వైస్ చైర్మన్ పదవి స్టేట్ కమిషనర్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించటమైనది.దీనికి పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణకు హాజరై ఉన్నారు.టోటల్ గా 32మంది వార్డు కౌన్సిలర్లకి 17 మంది సభ్యులు హాజరైనారు.ఫోరం పూర్తవటంతో 28 వ వార్డు కౌన్సిలర్ గర్రె నాగేశ్వరరావు,ఉన్నం భారతి 30 వ నెంబర్ ను బలపరుస్తూ 20 వ వార్డు నెంబర్ కొత్త సౌజన్య ప్రతిపాదించినారు.30 వ వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతిని పిడుగురాళ్ల వైస్ చైర్మన్ గా ఎన్నిక చేయటం జరిగిందన్నారు.డిక్లరేషన్ ఫారం కూడా వారికి ఇవ్వటం జరిగిందన్నారు.అనేక ట్విస్టుల మధ్య ఎట్టకేలకు వైస్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. సోమవారం పిడుగురాళ్లలో 30 వ వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతిని మున్సిపల్ వైస్ చైర్మన్ గా కౌన్సిలర్ సభ్యులు ప్రతిపాదించారు.మొత్తం 17 మంది హాజరైనట్లు ఎన్నికల అధికారి,గురజాల ఆర్డీవో మురళి తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.