నారద వర్తమాన సమాచారం
ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్
పొట్టి శ్రీరాములు జయంతి పురస్కరించుకుని పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో స్వతంత్ర సమరయోధులు కీర్తిశేషులు పొట్టి శ్రీ రాములు యొక్క చిత్ర పటానికి పూలమాల వేసి ఘనముగా నివాళులను అర్పించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…
పొట్టి శ్రీరాములు భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మా గాంధీ సిద్ధాంతాలను అనుసరించిన గొప్ప నాయకుడు.
ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడు.
పుట్టింది: 16 మార్చి 1901, నెల్లూరు జిల్లా వృత్తి: స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది తెలుగు ప్రజల హక్కుల కోసం పోరాటం మరణం: 15 డిసెంబర్ 1952 (ఉపవాస దీక్షలో) వారి యొక్క ప్రాణాలను కోల్పోయినట్లు
స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ పిలుపు మేరకు భాగస్వామ్యమైనారు. హరిజన uplift కోసం సేవ చేశారు.
తెలుగువారి కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేశారు. పొట్టి శ్రీరాములు చేపట్టిన నిరాహార దీక్ష 58 రోజులు కొనసాగింది. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించింది.
1953లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిందని పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రతి సంవత్సరం ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పొట్టి శ్రీరాములు జీవితం మనకు ధైర్యం, త్యాగం, పట్టుదల ఎలా ఉండాలో నేర్పుతుంది. తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడికి మనం గౌరవంగా శ్రద్ధాంజలి ఘటించాలని నేటితర యువతీ యువకులకు ఆదర్శప్రాయుడని కొనియాడినారు.
ఈ కార్యక్రమంలో ఎస్పి తో పాటు
ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ V. సత్తి రాజు వెల్ఫేర్ ఆర్ ఐ L. గోపీనాథ్ మరియు ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.