నారద వర్తమాన సమాచారం
బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా చిత్ర పటానికి ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు, ఐపీఎస్.,
ఎస్పీ మాట్లాడుతూ….
1908వ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన బీహార్ రాష్ట్రం చంద్వా గ్రామంలో జన్మించారు.
వీరు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నందు విద్యాభ్యాసం చేసి స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొనడం జరిగింది.
భారత పార్లమెంటులో 47 సంవత్సరాల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా కూడా వ్యవహరించారు.
స్వాతంత్ర్య భారతదేశ మొదటి కార్మికమంత్రిగా పనిచేసి, దేశంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి, హరితవిప్లవానికి సహాయ సహకారాలు అందించారని తెలిపారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు గా పేరు గాంచారని కొనియాడారు. పీడిత,తాడిత ప్రజలకు ఆశాజ్యోతి గా బాబు జగజ్జివన్ రామ్ ఎంతగానో కృషి చేశారు.
రాజనీతిజ్ఞుడు పరిపాలనాదక్షుడు అయిన బాబు జగజ్జివన్ రామ్ ప్రజల చేత ఆప్యాయంగా బాబూజీ అని పిలిపించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అదనపు ఎస్పి(అడ్మిన్) J.V సంతోష్ అదనపు ఎస్పీ ఏ.ఆర్ V. సత్తి బాబు ఎస్బి సి.ఐ 1 బండారు సురేష్ బాబు ఎస్బి సి.ఐ 2 P. శరత్ బాబు అడ్మిన్ RI రాజా , హోమ్ గార్డ్ ఆర్ ఐ కృష్ణ వెల్ఫేర్ RI L. గోపీనాథ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.