Wednesday, June 11, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్.

నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్.

ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 75 ఫిర్యాదులు అందాయి.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.

అమరావతి గ్రామానికి చెందినటువంటి సంపంగి పవిత్ర అను ఆమెకు పవన్ కుమార్ అతనితో సంవత్సరాల క్రితం వివాహం అయినట్లు, వివాహం సమయంలో పవన్ కుమార్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి వివాహం జరిపించినట్లు, వివాహానికి ముందే అతనికి చెడు అలవాట్లు ఉన్న విషయం చెప్పకుండా 2,00,000/- రూపాయలు కట్నం, బంగారం తీసుకున్నట్లు, వివాహం అనంతరం ఒక ఆడ,ఒక మగ సంతానం కలిగినట్లు, వివాహం అనంతరం పవన్ కుమార్ త్రాగి ఇంటికి వచ్చి తిడుతూ కొడుతూ ఉండేవాడని అతనికి మద్దతుగా వారి తల్లిదండ్రులు మరియు ఫిర్యాదు ఆడబిడ్డ మావాడు పని చేయలేడు మీ ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకురమ్మని పంపేవారని డబ్బులు తీసుకురాకపోతే చిత్రహింసలు పెట్టే వారిని అందుకు గాను తనకు న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాది అర్జీ ఇవ్వడం జరిగింది.

నరసరావుపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందినటువంటి తిరువాయిపాటి రవీంద్ర శ్రీనివాసరావు అను అతను బ్రతుకుతెరువు నిమిత్తం వేరే ప్రాంతంలో నివసిస్తున్నట్లు, తన స్వగ్రామం లింగంగుంట్ల నందు స్థలం కొనుగోలు చేసి ఇంటిని నిర్మించుకొని రెండు సంవత్సరాల పాటు ఆ ఇంటిలో ఉన్నట్లు, జీవనోపాధి కొరకు వెళుతూ తన ఇంటిని గత పది సంవత్సరముల క్రితము పెరంబదూరి ఆంజనేయులు అను అతనికి అద్దెకు ఇచ్చినట్లు, ఐదు సంవత్సరముల క్రితం ఆంజనేయులు మరణించగా అప్పటివరకు ఇస్తున్న అద్దె ఆయన మరణానంతరము ఆయన కుమారుడు లీల రంగ ప్రసాదు కు అద్దెకు ఇవ్వగా అతను ఒక నెల అద్దె ఇస్తే మరొక నెల ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు, ఒక సంవత్సర కాలము నుంచి ఇల్లు ఖాళీ చేసి అప్పగించకుండా ఇబ్బందుల పాలు చేస్తూ ఇంటి వద్దకు వెళితే తనపై దౌర్జన్యం చేసి మేము ఇల్లు ఖాళీ చేయము, నీకు చేతనైనది చేసుకో, దిక్కున చోట చెప్పుకో అంటూ బెదిరిస్తున్నందుకు గాను తగిన న్యాయం కొరకు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.

వినుకొండ స్వీపర్స్ కాలనీకి చెందిన బొప్పూరి రిబ్క అను ఆమెకు వెంకట నారాయణమూర్తి ఆయన అతను పరిచయమై వినుకొండ లోని GDS బ్యాంకు నందు పని చేస్తున్నానని నమ్మించి లోన్ ఇప్పిస్తానని, ఫిర్యాదు తో పాటు మరియొక తొమ్మిది మందికి చెప్పి ఒక్కొక్కరి వద్ద 15 వేల రూపాయలు వసూలు చేసి 15 రోజులపాటు గుంటూరులో ఉంచి చివరకు లోన్ కూడా ఇప్పించకుండా ఫిర్యాదు తో పాటు మిగిలిన 9 మంది కట్టిన డబ్బులు కూడా ఇవ్వకుండా మోసం చేశాడని, ఇదే విషయమై వెంకట నారాయణమూర్తికి వారు కట్టిన డబ్బులు ఇవ్వమని అడగగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతూ ఇబ్బంది పెడుతున్నందుకు గాను తగిన న్యాయం కొరకు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈపూరు మండలం ఇనుమెళ్ల గ్రామానికి చెందినటువంటి నర్రా వేణు బాబు అను అతనికి ఉద్యోగం ఇప్పిస్తానని బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామానికి చెందినటువంటి వేల్పుల కాటం రాజు అను అతను అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని మహారాష్ట్ర రాష్ట్రంలోని కొల్లాపూర్ కు రమ్మని చెప్పగా, అక్కడికి వెళ్లిన ఫిర్యాదుకి ఇంటర్వ్యూ నిమిత్తం 15 వేల రూపాయలు ఫీజు కట్టించుకున్నట్లు, నెలకు 50 వేల నుండి లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఒక నెల ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పి మోసం చేసినందుకు గాను ఈ రోజు ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.

ఈపూరు మండలం కూచన పల్లి గ్రామానికి చెందిన బత్తుల చిరంజీవి అను అతను అదే గ్రామానికి చెందిన పసుపులేటి అంజిబాబు వద్ద మూడు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని మిర్చి పంట సాగు చేసినట్లు, మిర్చి పంట చేతికి వచ్చిన తర్వాత కాయలు కోసి కళ్ళం లో ఆరబోసినట్లు ఒకరోజు ఒంట్లో బాగాలేదా రాత్రి కాపలాకు వెళ్లకుండా ఉండి ఉదయం ఐదు గంటలకు వెళ్లేసరికి ఆరబోసిన మిర్చి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లు సుమారు 15 క్వింటాళ్లు దొంగతనం జరిగినందున తగిన న్యాయం కొరకు గాను ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడమైనది.

రొంపిచర్ల మండలం చాకలికుంట తండా గ్రామ నివాసి అయిన కేతావత్ దేవి భాయి అను ఆమెకు పది సంవత్సరాల క్రితం సత్తెనపల్లి సుగాలి కాలనీకి చెందిన కేతావత్ గోపి నాయక్ అను అతనితో వివాహం అయి ముగ్గురు పిల్లలు కలిగినట్లు,ఫిర్యాది వద్ద ఉన్నటువంటి బంగారం మొత్తం తనఖా పెట్టి వచ్చిన డబ్బులు మద్యం సేవిస్తున్నట్లు,అడిగితే కొడుతున్నట్లు, ముగ్గురు పిల్లలను అతని వద్దనే పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నట్లు,పిల్లల కొరకు ఫిర్యాది అన్నయ్య,వదినను పంపగా విడాకులు ఇవ్వకపోతే చంపుతానని బెదిరిస్తున్నందుకు గాను తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహయ సహకారాలు అందించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version