అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి అటవీప్రాంతంలో ఎర్రచందనపు స్మగ్లర్ ల ను అదుపులో తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
నారద వర్తమాన సమాచారం
ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్ (RSASTF)
48 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
నలుగురు స్మగ్లర్లు అరెస్టు
అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి
అటవీప్రాంతంలో ఘటన
ఒక మోటారు సైకిల్ స్వాధీనం
అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి అటవీప్రాంతంలో 48ఎర్రచందనం దుంగలతో పాటు ఒక మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకుని, నలుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ గారి ఆదేశాలతో డీఎస్పీ శ్రీ జి. బాలిరెడ్డి మార్గ నిర్దేశకత్వంలో ఆర్ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ మురళీధరరెడ్డి టీమ్ శనివారం అన్నమయ్య జిల్లా బురకాయల కోట అటవీ ప్రాంతం చేరుకుని, స్థానిక అటవీ అధికారులు జయప్రసాదరావు, మోహన్ రెడ్డి, షబీన్ తాజ్ ల సహకారం తో వేపూరి కోట ఫారెస్ట్ బీటు పరిధిలో డంపింగ్ పాయింట్ల తనిఖీ చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున వీరు అన్నగారి పల్లి సమీపంలోని వంకగట్టు వద్ద ఒక మోటారు సైకిల్ కనిపించింది. దానిని సమీపించడంతో అప్పటికే అక్కడ గుమికూడి ఉన్న కొందరు పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంబడించి నలుగురిని పట్టుకున్నారు. ఆప్రాంతంలో తనిఖీ చేయగా అక్కడ 48 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని అన్నమయ్య జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. వారితో పాటు ఎర్రచందనం దుంగలు, మోటారు సైకిల్ ను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.