నారద వర్తమాన సమాచారం
ఎంప్లాయిస్ యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
యూనియన్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుబడి వచ్చే సంవత్సరం వజ్రోత్సవ వేడుకలను నిర్వహించుకుందామని ఎంప్లాయిస్ యూనియన్ పల్నాడు జిల్లా సెక్రెటరీ పివి. శివయ్య తెలిపారు. శుక్రవారం మాచర్ల ఆర్టీసీ డిపో లో ఏపీపీ టి డి ఎంప్లాయిస్ యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు డిపో అధ్యక్షులు ఎన్. నీలం రాజు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. అనంతరం గ్యారేజ్ సిబ్బందితో జెండా ఆవిష్కరణ జరిపి మహిళా సభ్యులతో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు చిన్నయ్య, ప్రత్యేక సలహాదారుడు ఎస్ ఎస్ రావు, కార్యదర్శి ఎం వి కె. చారి, అధ్యక్ష,కార్యదర్శులు అప్పారావు, సాగర్ బాబు, శ్రీనివాసరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.