నారద వర్తమాన సమాచారం
ప్రయాణికుల వినతులతో కర్నూలు కు బస్సు సర్వీసు ఏర్పాటు..రేపు మాచర్లలో బస్సు సర్వీసు ప్రారంభం
ఏడాది కాలంగా మాచర్ల డిపో ఆధ్వర్యంలో కర్నూలుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
డయల్ యువర్ మాచర్ల డిఎం ప్రోగ్రాం లో ప్రయాణికులు కర్నూలు బస్సు సర్వీసు తిరిగి పునరుద్ధరణకు అధిక సంఖ్యలో ఫోన్ కాల్ ద్వారా వినతులు అందించారు.
వినతులను గుర్తించిన ఆర్టీసీ అధికారులు గతంలో మాదిరిగా ఆల్ట్రా డీలక్స్ బస్సు ఏర్పాటు చేశారు. బుధవారం మాచర్ల లో కర్నూలు బస్సు సర్వీసును ప్రారంభిస్తారు.
ఈ బస్ సర్వీసు ప్రారంభంతో పల్నాడు, ప్రకాశం, కర్నూలు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ బస్సు సర్వీసు ఏర్పాటుచేసిన ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి, ఆర్టీసీ ఎండి. ద్వారకా తిరుమల రావు, ఈడీలు నాగేంద్రప్రసాద్, అప్పలరాజు (ఆపరేషన్), పల్నాడు డి పి టి ఓ అజిత కుమారి, డిఎం బి. వీరస్వామి లకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







