పీఎం కిసాన్ ఫార్మర్ రిజిస్ట్రీపై అవగాహన సదస్సు
నారద వర్తమాన సమాచారం
నల్గొండ జిల్లా ఇంచార్జ్ : శంకర్
శనివారం మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం, తుంగపాడు, శ్రీనివాస్ నగర్,, మిర్యాలగూడ రైతు వేదికలలో రైతులకు పీఎం కిసాన్ ఫార్మర్ రిజిస్ట్రీ పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి సైదా నాయక్, ఏ డి ఏ ఇన్చార్జ్, రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ (రైతు నమోదు) చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుండి రైతులకు అందించే అన్ని పథకాలు ఇకపై ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ ఆధారంగా అమలు చేయబడతాయని, అందువల్ల రైతు సోదరులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా లబ్ధి పొందాలంటే వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ షఫీ , సంబంధిత సిబ్బంది, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







