Sunday, July 13, 2025

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

నారద వర్తమాన సమాచారం

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

భూదాన్ పోచంపల్లిలో బిక్షాటన చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు

భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్ట యాదమ్మ అన్నారు. పట్టణ కేంద్రంలో 9 నెలలుగా వేతనాలు అందడం లేదని నిరసిస్తూ గ్రామపంచాయతీ కార్మికులు బుధవారం భిక్షాటన చేశారు. ఎన్నికల ముందు నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 30న చేపట్టే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గడ్డం ఈశ్వర్, బాబు, కిష్టయ్య, శంకరయ్య, నరసింహ, పద్మ, జయమ్మ పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading