ఎమ్మెల్యే కుంభంని కలిసిన నూతన అర్బన్ బ్యాంక్ కార్యవర్గం
ఎమ్మెల్యేని సన్మానిస్తున్న బ్యాంక్ చైర్మన్ తడ్క రమేష్
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
గురువారం పోచంపల్లి అర్బన్ బ్యాంక్ నూతన కార్యవర్గం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికైన డైరెక్టర్లతో చైర్మన్ తడక రమేష్ ఆయనకు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందిస్తూ బ్యాంకు అభివృద్ధికి తోడ్పడి కృషి చేయాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్, అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ భారత రాజేందర్ ప్రసాద్, డైరెక్టర్లు ఏలే హరిశంకర్, కొండమడుగు ఎల్ల స్వామి, కర్నాటి భార్గవి, నాయకులు కుడికాల బాల నరసింహ, టి వెంకటేష్ తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.