Monday, June 9, 2025

కార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాలల హక్కులు నూతన చట్టాలు అవగాహన సదస్స …..

నారద వర్తమాన సమాచారం

బాలల హక్కులు సమాజం లో పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని ఏక్స్ ,ఏ జి పి సీనియర్ న్యాయవాది ఎ. రూత్ బనియన్ అన్నారు. కార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాలల హక్కులు నూతన చట్టాలు అవగాహన సదస్సు ఆయన ముఖ్యఅతిథిగా వచ్చి ప్రారంభించి మాట్లాడారు ఈ కార్యక్రమం పిడుగురాళ్ల లెనిన్ నగర్ కార్డ్స్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా వచ్చి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి కార్డ్స్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ తాళ్లూరి అమర్నాథ్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ బాలబాట ఆర్గనైజర్ పిడుగురాళ్ల .మాచవరం . మండలాల్లో దళితవాళ్లలో విద్యా సామాజిక చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత బాలబాట ఆర్గనైజర్ మీద ఉందని అన్నారు. న్యాయవాది ఎమ్ . రాజశేఖర్ మాట్లాడుతూ పేద వర్గాలు విద్య ద్వారానే సమాజంలో గౌరవం లభిస్తుందని అప్పుడే రాజ్యాంగ విలువలు తెలుస్తాయని డాక్టర్ అంబేద్కర్ బాబు జగజీవరావు ఆదర్శంగా తీసుకొని బాలబాట ఆర్గనైజర్ కృషి చేయాలని దళిత హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని అన్నారు. మరొక అతిథి బంక విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో విజ్ఞానవంతమైన సమాజం కోసం కార్డ్స్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో కార్డ్స్ స్కూల్ హెచ్ ఎమ్ ,పి. లతా. ఉపాధ్యాయులు దయామని .సునీత. షేక్ . అబ్దుల్ రహీం. మాట్లాడారు అనంతరం బాలబాట ఏసివో జి.విజయ్ కుమార్ దళిత సేవ దళ్ గడ్డం సామెల్ తదితరులు పాల్గొన్నారు అనంతరం బాలబాట డివో లకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు మరియు 1200 కుటుంబాలకు 10 రకాల కూరగాయల విత్తనాలు కార్డ్స్ ఆర్గనైజర్స్ కు అందించారు ఈ కార్యక్రమం దళిత చైతన్య గీతాలు సదస్సును ఆకట్టుకున్నాయి.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version