నారద వర్తమాన సమాచారం
పట్టణ ప్రాంతంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి – డా!! చదలవాడ హరిబాబు, సి.సి.ఐ. జాతీయ ఉపాధ్యక్షులు
గుంటూరు :
ఇక నుండి పట్టాన ప్రాంతంలోని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులు అమలు జరిగేలా చూడాలని సంబందిత శాఖల వారికి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ననుసరించి గుంటూరు నగర ప్రాంతంలో హెల్మెట్ దుకాణాల లోని హెల్మెట్ ల నాణ్యతా ప్రమాణాలను లీగల్ మెట్రాలజి ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ తో జిల్లా వినియోగదారు
ల సమాచార కేంద్రం కన్వీనర్ డా!! చదలవాడ హరిబాబు తనిఖీలు నిర్వహించారు. కొత్తపేట లోని పలు గోడౌనులను తనిఖి చేసి ప్యాకేజి కమోడిటీ చట్టం ప్రకారం లేబుల్ ముద్రించవలసిన అంశాలను పరిశీలించగా తయారుదారుని మెయిల్ ఐ.డి. ని ముద్రించనందున కేసు రాయడము జరిగినదని డా!! హరిబాబు ఒక ప్రకటనలో తెలియజేసారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.