నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్,
రోడ్డు ప్రమాదాలను ని
వారించడమే ముఖ్య ఉద్దేశంగా వినుకొండ పట్టణంలో సరియైన ధ్రువీకరణ పత్రాలు లేని మోటార్ వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అనంతరం అసాంఘిక శక్తులను గుర్తించుటకై లాడ్జిలను ఆకస్మిక తనిఖీ చేసిన పల్నాడు జిల్లా పోలీసులు..
ది.04.9.2024 వ తేదీన పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసరావుపేట డీఎస్పీ పర్యవేక్షణలో వినుకొండ టౌన్ సిఐ ఆధ్వర్యంలో పట్టణంలో ఏకంగా 10 మంది ఎస్ఐ లు, 30 మంది స్టాఫ్ తో సరియైన ధృవీకరణ పత్రాలు లేని మోటార్ వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఏకంగా 102 ఎటువంటి పత్రాలు లేని, నెంబర్ ప్లేట్స్ లేని,రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వాహనాలను సీజ్ చేసిన పల్నాడు జిల్లా పోలీసులు..
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఎవరైనా కూడా వాహనానికి సరైన దృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని, అదేవిధంగా బైక్ లను జాగ్రత్తగా రోడ్లపై నడపాలని, తాగి వాహనాలు నడపరాదని, స్నేక్ డ్రైవింగ్ లాంటివి చేయకూడదని రోడ్లపై ప్రజల యొక్క ప్రాణాలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా వాహనదారులు ప్రవర్తించాలని ప్రజలను కోరారు.
అలా కాక విచ్చలవిడిగా రోడ్లపై వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
ఈ సీజ్ చేయబడిన వాహనాలకు సంబంధించి ఓనర్లు సరైన పత్రాలు తీసుకొని వచ్చిన యెడల వాటిని విడుదల చేయడం జరుగతుందని లేనియెడల వాటిని కోర్టుకు అప్పగించడం జరుగుతుందని తెలియజేశారు.
అదేవిధంగా,
అసాంఘిక శక్తులు వాటి యొక్క కార్యకలాపాలపై పల్నాడు జిల్లా పోలీసులు ఎప్పుడు నిఘా ఉంచుతారని దానిలో భాగంగా జిల్లా పరిధిలో లాడ్జిలను విరివిగా ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుందని ఎవరైనా అసాంఘిక కార్యకాలాపాలకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి జిల్లా పోలీసులు వెనకడబోరని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.