నారద వర్తమాన సమాచారం
గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలి
- : సకాలంలో ఏర్పాట్లన్నీ పకడ్బందీగా పూర్తి చేయాలి
- : జిల్లా కలెక్టర్ – పి అరుణ్ బాబు
- జనవరి 26వ తేదీన నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ లోని ఈనెల 26వ తేదీన నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అన్ని శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
- *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ లో కొత్తగా ఏర్పాటు చేసిన పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు సకాలంలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వేడుకలను మినిట్ టూ మినిట్ నిర్వహించేలా చూడాలని, ఎలాంటి లోటుపాట్లు ఎదురు కాకుండా చూసుకోవాలన్నారు. జిల్లా అధికారులు అంతా ఒక కుటుంబంలా వేడుకలను నిర్వహించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, జిల్లా అధికారులు, ప్రజల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేయాలన్నారు. వేడుకల కోసం పెరేడ్ గ్రౌండ్ ని బాగా తయారు చేయాలని, పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ,
- శకటాల ప్రదర్శన, స్టాల్ల్స్ ఏర్పాటు చేయాలన్నారు. అవార్డులు అందించే వారి కోసం సర్టిఫికెట్ ఫైనలైజ్ చేయాలన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారికి తాగునీటి సరఫరా చేయాలని, స్నాక్స్ అందించాలని, శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గణతంత్ర వేడుకలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.*
- ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్, డిఆర్ఓ మురళి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.