నారద వర్తమాన సమాచారం
కన్యకా పరమేశ్వరి అమ్మ వారికి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని
పిడుగురాళ్ల
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణం జానపాడు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారి దేవాలయంలో ఆత్మార్పణ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అధికారికం గా ప్రకటించబడిన సందర్భంగా గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి కి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు
అంతకుముందు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు కన్యక పరమేశ్వరి దేవాలయాల్లో అమ్మవారి ఆత్మర్పణ కమిటీ, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
కార్యక్రమాల్లో గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీఎమ్, డిప్యూటీ,సీఎమ్,అన్ని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాల్లో ఆత్మర్పణ దినోత్సవాలు నిర్వహించాలని జీవోని తీసుకొచ్చారని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ళ మున్సిపల్ ఛైర్మన్ సుబ్బారావు, ఆలయ పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.