నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల టౌన్ వాకింగ్ స్ట్రీట్ నందు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్
ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ నేడు సాయంత్రం పిడుగురాళ్ల టౌన్లో walking streetలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు!
నేడు సాయంత్రం పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల టౌన్లో walking streetలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ పాల్గొని, ఈ అందమైన సందర్భానికి మరింత వన్నె తెచ్చారు. పిడుగురాళ్ల టౌన్ను మరింత పచ్చదనంతో అందంగా తీర్చిదిద్దే ఈ కార్యక్రమం, పర్యావరణ పరిరక్షణలో ఒక అద్భుతమైన ఆరంభంగా నిలిచింది.
ఈ సందర్భంలో మంత్రి , పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనాన్ని పెంచడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందవచ్చని ఆనందంగా తెలియజేశారు. walking streetలో నాటిన మొక్కలు భవిష్యత్తులో ఈ ప్రాంతానికి అందమైన ఆకుపచ్చని ఛాయను అందిస్తాయని మంత్రి హృదయపూర్వకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పి.వి.ఎన్. మాధవ్, మధుకర్ జీ, పల్నాడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.