నారద వర్తమాన సమాచారం
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్
పరేడ్ గ్రౌండ్స్ లో వన మహోత్సవం
నరసరావు పేట,
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. మనతో మనం మమేకం అవడం యోగా అయితే, ప్రకృతితో మమేకం అవడం ‘హరిత యోగా’ అని పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావులు స్థానిక పరేడ్ గ్రౌండ్స్ లో వన మహోత్సవం నిర్వహించి మొక్కలు నాటారు.
యోగాంధ్ర, వనమోత్సవం కార్యక్రమాలకు హాజరైన వారితో డీఎఫ్వో (సామాజిక అడవులు) అశోక్ వన మహోత్సవం మరియు ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞను చేయించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో మురళి, జిల్లా అటవీ అధికారి కృష్ణ ప్రియ, ఆర్డీవో మధులత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.