నారద వర్తమానం సమాచారం
వేములవాడ రాజన్న ఆలయానికి 8,22 కోట్ల ఆదాయం!
రాజన్న జిల్లా:
తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన ప్రముఖ పుణ్య క్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి కార్తీకమాసం లో భారీగా ఆదాయం వచ్చింది, ఈ నెల రోజుల్లో వేములవాడ రాజన్న ఆలయానికి రూ.8.22 కోట్ల ఆదాయం సమకూరింది.
లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకు న్నారు. హుండీ ద్వారా రూ.4.22 కోట్లు, కోడె టికెట్ల ద్వారా రూ.1.65 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ.1.73 కోట్లు, రుద్రాభిషేకం టికెట్ల ద్వారా రూ.24.18 లక్షలు, శీఘ్ర, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.63.53 లక్షలు, కల్యాణం టికెట్ల ద్వారా రూ.39.60 లక్షలు, ఇతర సేవల ద్వారా రూ.66.73 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







