Tuesday, December 16, 2025

ప్రజా సేవకే పట్టం కట్టిన తిరుమలగిరి గ్రామ ప్రజలు

ప్రజా సేవకే పట్టం కట్టిన తిరుమలగిరి గ్రామ ప్రజలు

నారద వర్తమాన సమాచారం

ప్రతినిధ

బంధన కంటి శంకర్

తిరుమలగిరి, సాగర్ మండలం, తిరుమలగిరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వాతంత్ర అభ్యర్ది తిరుమలగిరి గ్రామ ప్రజలు బలపరిచిన అభ్యర్ది పగడాల పున్నమ్మ – సైదులు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్ది శాగం పద్మా- పెద్దిరెడ్డి,స్వాతంత్ర అభ్యర్ది ఆవుల అచ్చమ్మ ల మీద 500 ఓట్ల పైచిలుకు మెజారిటీతో వారు విజయం సాధించారు. ఈ విజయం ప్రజా విజయమని అని అన్నారు.వారు గత రెండు సవంత్సరాలుగా గ్రామంలో ప్రజలకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకి ఆర్ధికంగా సహాయం చేస్తూ వారి అభిమానాన్ని చొరగోన్నారు.సర్పంచ్ ఎన్నికల్లో తన ప్రచార సరలిని ఒక్క అవకాశం ఇవ్వండి మరింత సేవ చేసే బలాన్ని ఇవ్వండి అంటూ ప్రజల నుండి సైలెంట్ ఓటు ను రాబట్టుకోవడం లో విజయం సాధించాడు. ఈ సందర్బంగా పగడాల సైదులు మాట్లాడుతు తన సతీమణికి ఓటు వేసి సర్పంచ్ గా గెలిపించిన తిరుమలగిరి గ్రామపంచాయతీ ప్రజలకు, యువకులకు, తన వెంట ఉండి ముందుకు నడిపించి ముమ్మరంగా ప్రచారం చేసిన యువ నాయకుడు గోపి కి ధన్యవాదాలు తెలిపారు.తిరుమలగిరి గ్రామాన్ని, బడాయిగడ్డ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా సేవ చేస్తానన్నారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version