నారద వర్తమాన సమాచారం
పీజీఆర్ఎస్ ఫిర్యాదుపై క్షేత్ర స్థాయి విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
సత్తెనపల్లి,
మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఓ పీజీఆర్ఎస్ ఫిర్యాదుపై సత్తెనపల్లి మండలం, గుడిపూడి గ్రామంలో క్షేత్ర స్థాయి విచారణ చేపట్టారు.
గ్రామంలోని దేవాదాయ భూములపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించే ప్రజావేదికలో గ్రామస్తుడైన గంధం శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు.
పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు గుడిపూడి గ్రామంలో ఫిర్యాదిదారును కలిసి అతను సమర్పించిన రికార్డులు, అధికారుల వద్దనున్న రికార్డులను పరిశీలించారు.
చట్ట ప్రకారం దేవాదాయ భూముల విస్తీర్ణం నిర్ణయిస్తామని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో విచారణ చేపడతామని, నాణ్యమైన పరిష్కారాలు అందించని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.