నారద వర్తమాన సమాచారం
పట్టణాల్లో నిర్మాణాలకు ఊరట… ఖాళీ స్థలాల పన్నులో 50% మినహాయింపు
ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుర, నగరపాలక సంస్థల పరిధిలో నిర్మాణాలకు సంబంధించిన ఖాళీ స్థలాలపై విధించే పన్నులో 50 శాతం మినహాయింపు ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించింది.
నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీని ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం లభిస్తుందని, పెట్టుబడులు పెరగనున్నాయని అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో పట్టణ స్థానిక సంస్థల పరిధిలో డిస్ప్లే బోర్డులు, సైన్బోర్డులు, వాహనాలపై ప్రకటనలు ప్రదర్శించాలంటే తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ప్రకటనలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ నిర్ణయాలతో పట్టణాల్లో క్రమబద్ధత పెరుగుతుంది, అక్రమ ప్రకటనలకు చెక్ పడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







